చిన్నారిని ఆదుకోండి

Published: Tuesday January 25, 2022
జన్నారం రూరల్ జనవరి 24 ప్రజాపాలన : మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన జాడి రాజన్న సునితా దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు, ఆ దపంతుల కుమారుడైన సాయివర్ధన్ (12) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారాని తెలిపారు, ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ కుమారుడు వైద్యకోసం 12 లక్షలు వరకు ఖర్చువుంతుదని నిమ్స్ వైద్యులు తెలిపారు, నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు కష్టపడి సంపాదించిన సొమ్ము ఇరుగు పోరుగు కలపి 2 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు, కుమారుడు వైద్యుకోసం 12 లక్షలు పెట్టే ఆర్ధిక స్తోమత లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు, కుమారుడు కిడ్నీ సమస్య చికిత్సకు అవసరమైన సహాయం కోసం ఎదురు చేస్తున్నామని వారు తెలిపారు, దాతలు ముందుకు వచ్చి మానవత్వంతో వారికి తోచిన సహయం అందించాలని, మానవాతవాదులు సహయన్ని అందించి ఆదుకోవాలని అ నిరుపేద జాడి రాజన్న సెల్ నెం. 6300640865 దంపతులు కోరుతున్నారు.