నూతన వధూవరులను ఆశీర్వదించిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

Published: Wednesday December 01, 2021
మేడిపల్లి, నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : సీనియర్ జర్నలిస్ట్ విజేందర్ రెడ్డి సోదరి సుష్మా రెడ్డి వివాహం హైదరాబాద్ నాగోల్ లోని అనంతుల రాంరెడ్డి గార్డెన్స్ లో వైభవంగా జరిగింది. మేడిపల్లికి చెందిన కెమికల్ ఇంజనీర్ కుశలవ రెడ్డితో జరిగిన ఈ వివాహానికి బంధువులు, జర్నలిస్టులు, ప్రముఖ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి మంత్రివర్యులు మహమూద్ అలీ, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ అడ్వకేట్ రామచంద్ర రావు, రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, టీఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ జర్నలిస్టు సోదరి వివాహానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విజయేందర్ రెడ్డి జర్నలిస్టుగా తనకు ఎంతో కాలం నుంచి తెలుసునని అన్నారు. తను వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే కచ్చితంగా వివాహానికి హాజరు అవుతానని చెప్పానని అందుకే తాను వచ్చానని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. నాయకులు, బంధువుల పెళ్లి కంటే ఒక జర్నలిస్ట్ కుటుంబం వివాహానికి హాజరు కావడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సుష్మా రెడ్డి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. తమ సోదరి వివాహానికి హాజరైన వారందరికీ జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.