బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా తాళ్ల వెంకటేష్ గౌడ్
Published: Thursday September 30, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ కిసాన్ మార్చా కార్యవర్గ సభ్యుడిగా తాళ్ల వెంకటేష్ గౌడ్ ను పార్టీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి, ముత్యాల భాస్కర్, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నరసింహారెడ్డి, తాళ్ల వెంకటేష్ గౌడ్ ను నియమిస్తూ శనివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని, సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని, ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలను మరింత విస్తరించడానికి కృషి చేస్తానని నా నియమానికి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తాళ్ల వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: