ఉపాధి పనులను పకడ్బందీగా నిర్వహించాలి. అదనపు డీఆర్డీవో శిరీషా..

Published: Saturday August 20, 2022
పాలేరు ఆగస్ట్ 19 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం పనులు
పకడ్బందీగా నిర్వహించాలని అదనపు డీఆర్డీవో శిరీషా సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హమీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్స్ కు అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పథకం పక్కాగా అమలు చేసేందుకు సమన్యయంతో ముందుకు సాగాలని సూచించారు. మారిన పథకం సాఫ్ట్వేర్ పై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పథకం విజయవంతంగా నిర్వహించేందుకు పంచాయతీ పాలకవర్గం. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ అవగాహన కలిగి ఉండాలని. అన్నారు. ప్రతీ పనికి పంచాయతీ తీర్మానం ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ కె. జమలారెడ్డి మాట్లాడుతూ డెంగీ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అప్రమతంగా ఉండాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సి.హెచ్.శివ, ఈజీఎస్ ఏపీవో సునీత. ఈ.సి. శేషగిరిరావు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.