పలు జిల్లాలో దూప దీప రక్షకులు కరోనతో మృతి

Published: Friday May 07, 2021
శుభకార్యాలు జరుపుకోవద్దు - జగన్ పంతులు
జగిత్యాల, మే 06 (ప్రజాపాలన ప్రతినిధి): కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దూప దీప రక్షకులు కరోన బారినపడి 11 రోజుల్లో ఇరవై మంది బ్రాహ్మణులు మృతి చెందారు. ఈ సందర్బంగా జగన్ పంతులు మాట్లాడుతు ఇ లాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, కడపలు, ముగ్గులు, వర పూజలు, పూలు పండ్లు, పెట్టమని బ్రాహ్మణులకు ఫోన్ చేసి బాధ పెట్టడం సరికాదు. శ్రావణ మాసంలో దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయి. అప్పుడు పెళ్లిళ్లు పేరంటాలు జరుపోకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి. మూడపెళ్లి, అనంత పెళ్లి, నరసింగాపురం, ఆ శిరిడి పల్లి, గొల్లపల్లె, తిమ్మాపురం ప్రజలు అందరూ అర్థం చేసుకోగలరు.