వాహనదారులు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలి

Published: Monday March 13, 2023

జన్నారం, మార్చ్ 12, ప్రజాపాలన: వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని జన్నారం పోలీసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ సమీపంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. మండలంలోని వాహనం ఉన్న ప్రతి వాహనదారుడు 18 సంవత్సరాల నుండి ఉన్న వారు వాహనం నడపాలన్నారు. టు వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి వాహనదారుడు ఇన్సూరెన్స్ ఆర్ సి ఇతర అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. వాహనదారుడు వాహనం నడిపే సమయంలో రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అతివేగంగా వాహనం నడపకూడదని ఆయన కోరారు. వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జన్నారం  పోలీసులు, తిరుపతి, వెంకటేశులు వాహనదారులు పాల్గొన్నారు.