బూతు వారీగా వైఎస్సార్ టిపిని పటిష్ఠపరుద్దాం

Published: Tuesday February 15, 2022
వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి రాజు
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : బూతు వారీగా వైఎస్సార్ టిపిని పటిష్టపరిచేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి రాజు పిలుపునిచ్చారు. సోమవారం పరిధిలోని సూర్య ప్రకాష్ టౌన్ లో గల వైఎస్సార్ టిపి కార్యాలయంలో జిల్లా మండల కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీని గడపగడపకు చేర్చేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు మండల జిల్లా స్థాయి కమిటీలలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని వివరించారు. పార్టీ శ్రేయస్సు కొరకు కార్యకర్తలు అందరము సమన్వయంతో ఐకమత్యంతో ముందుకు వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా రవీందర్ గుప్తా ఎస్సీ మహిళా అధ్యక్షురాలిగా ఏ రజిని క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు గా కె రాములు మైనార్టీ సెల్ అధ్యక్షులు గా గా నవాజ్ జిల్లా స్పోక్స్ పర్సన్స్ గా కోళ్ల యాదయ్య మామిడి సంగమేశ్వర్ బుస్సా రాఘవేందర్ రెడ్డి జిల్లా మీడియా ఇన్ఛార్జీలుగా నాగరాజు రమేష్ వెంకటేష్ శశి వర్ధన్ గౌస్ జిల్లా మహిళా కన్వీనర్ గా పి సుధారాణి జిల్లా యూత్ కన్వీనర్గా కొంపల్లి వేణులకు జిల్లా బాధ్యతలు అప్పగించామని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గ కమిటీ సభ్యులను కూడా నియమించామని పేర్కొన్నారు.