కొక్కి రాల క్రికెట్ టోర్నీని గెలుచుకున్న 19 వార్డ్

Published: Monday March 29, 2021

బెల్లంపల్లి, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి: గత వారం రోజులుగా బెల్లంపల్లి 2వ క్రీడా మైదానంలో బెల్లంపల్లి మునిసిపాలిటీ పరిధి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆ ధ్వర్యములో జరిగిన క్రికెట్ పోటీలు ఆదివారం నాడు ముగిశాయి. ఈ పోటీల్లో 34 వార్డుల నుండి జట్లు పాల్గొనగా 19 వ వార్డ్ మొదటి స్థానాన్ని దక్కించుని 75 వేల రూపాయల చెక్ ను షీల్డ్ మెమోంటోలను ద్వితీయ బహుమతిని 8వ వార్డ్ దక్కించుకుని 40 వేల నగదు చెక్ ను షీల్డ్ మెమెంటోలను దక్కించుకున్నారు. అలాగే 1స్ట్ సెమీఫైనల్ కు వచ్చిన 19 వార్డు కు మరియు 2వ సెమీఫైనల్ వచ్చిన 11 వ వార్డుకు చెరో 20 వేల రూపాయల నగదు బహుమతిని  అందించారు. గెలిచిన జట్లకు చెక్కులను, షీల్డ్ లను, ట్రోఫీ లను, మేమేంటోలను, ట్రస్ట్ ఛైర్మన్ మాజీ ఎం ల్ సి,  ఏ ఐ సి సి సభ్యుడు ప్రేమాసాగర్ రావు అ అందించారు. ఈ సందర్భంగా ఆయన పోటీ లలో గెలుపోటములు సహజమని ఓడిన వారు మరింత పట్టుదలతో ఆడి గెలిచేందుకు ప్రయత్నించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు నాయకులు పాల్గొన్నారు.