పి ఏ సి యస్ మంచి నీటి ప్లాంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Thursday October 14, 2021
మల్లాపూర్, అక్టోబరు 13(ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలం మొగిలిపేట్, నడికూడ, సిరిపూర్ గ్రామాలలో సిరిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఆధ్వర్యంలో పి ఏ సి యస్ అధ్యక్షులు బద్దం అంజిరెడ్డి మినిరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బుధవారం మూడు మంచి నీటి ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో మంచి నీటిని తీసుకోవడం ఎంతో సురక్షితమని, మూడు గ్రామాల ప్రజలకు ఈ మంచి నీటి  ప్లాంట్లు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కాటిపెల్లి సరోజన అదిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, టి ఆర్ యస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, సురేష్ రావు, ఉపాధ్యక్షులు దులూరి సుధాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవేందర్, వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, ధమయ్య, ఇప్ప లక్ష్మి, జక్కుల రంగరాజన్, సంపద లక్ష్మీనారాయణ, మోహన్ గాయత్రి, చిన్నయ్య, లింగస్వామి, సర్పంచులు వనతడుపుల నాగరాజు, భూక్య గోవింద్ నాయక్, భూక్య రుక్మ నాయక్, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.