ఘనంగా అయ్యప్ప స్వామీ మహ పడిపూజ
Published: Thursday December 02, 2021
మేడిపల్లి డిసెంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరరావు అధ్వర్యంలో వారి స్వగృహం నందు ఘనంగా అయ్యప్పస్వామి మహ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ, ఉప్పల శ్రీనివాస్ గుప్తా (టీ.ఎస్.టి.డి.సి).కటేపల్లి జనార్థన్ రెడ్డి (ఎమ్మెల్సీ). కాంగ్రెస్ సినియర్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి, చిల్కానగరర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్,మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజన్న, చిల్కానగర్ మాజీ కార్పొరేటర్ సరస్వతి సదానంద్, ఉప్పల్ నియొజకవర్గ తెరాస నాయకులు, అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థథప్రసాదాలు తోపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు
Share this on your social network: