రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలు చాలా బాధాకరం

Published: Wednesday February 15, 2023

జన్నారం, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: రాష్ట్రంలో సర్పంచ్ల ఆత్మహత్యలు చాలా బాధాకరమని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని మందపెల్లి లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాయమాటలతో ప్రభుత్వం ఆదివాసి గిరిజన ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఆదివాసి గిరిజన గ్రామాల్లో ప్రజలు మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గ్రామాలలో ప్రభుత్వ మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల జిల్లాలలో మాత్రమే జరిగిందని ఇతర జిల్లాల్లో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. సర్పంచులు చేసిన పనులకు బిల్లలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలోని ఇంధన్ పల్లి కలమడుగు కామన్ పల్లి మురిమడుగు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలో గొర్ల పాలనను తరిమికొడతామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని దోచుకుంటున్నాయన్నారు. ఈ ప్రభుత్వాలకు చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్సి నాయకులు, తదితరులు పాల్గొన్నారు