బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన శంకరపట్నం నవంబర్ 03 ప్రజాపాలన ప్రతినిధి:
శంకరపట్నం
మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన రహదారిపై బిజెపి నాయకుల నిరసన రాస్తారో కార్యక్రమానికి గురువారం హాజరైన భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ
కేసీఆర్ తాను మునుగోడులో ఎదురుకోబోవు ఓటమి జీర్ణించుకోలేక మునుగోడు నియోజకవర్గం లో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాడు..
ప్రచార సమయం ముగుసినా కూడ ఎమ్మెల్యేలను,మంత్రులను దించి బిజెపి నాయకులను బెదిరిస్తూ,నియోజకవర్గ ప్రజలను,ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుండగ,ఎన్నికల నియమావళికి లోబడి నిరసన తెలుపుదామని బయలుదేరిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బలవంతంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు శంకరపట్నం,మండల బిజెపి నాయకులు.పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారుఈ
కార్యక్రమములో,జిల్లా అధికార ప్రతినిధి అలుగువెల్లి సమ్మిరెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్,జిల్లా సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి,దండు కొమురయ్య,మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడ అశోక్,మండల కార్యదర్శి దాసరపు నరేందర్,మండల ఉపాధ్యక్షులు మంద శ్రీనివాస్ రెడ్డి,పెసరి అర్జున్,దళిత మోర్చా మండల అధ్యక్షులు కనకం సాగర్,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి రమణ రెడ్డి BJYM మండలాధ్యక్షులు బొడిగె నరేష్,ఉపాధ్యక్షుడు బొజ్జ సాయి,ప్రణయ్,నాయకులు పల్లె శివారెడ్డి,మహేందర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,తోట వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: