ముఖ్యనేతలతో మంత్రి బేటీ

Published: Thursday March 04, 2021
ఖమ్మం, మర్చి 3, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ల్లో అధికార రియారెస్ పార్టీ విజయం కోసం ఆ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు టీమ్ వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే రవాణ శాఖ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఖమ్మం నగరం లోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో బేటీ అయ్యారు కార్యాలయ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాల పై చర్చించారు అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అజయ్ అన్నారు.ఎన్నికల తేది సమీపిస్తున్నందున పార్టీ నాయకులు. కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయలని కోరారు. ఖమ్మం నగరం లోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా సతీమణి పల్లా నీలిమ మాట్లాడుతు గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. సమావేశంలో మేయర్ పాపాలాల్. సుడా చైర్మన్ విజయ్. డీసీసీబీ చైర్మన్ నాగభూషణం. టి ఎస్ పి ఎస్ సి సభ్యురాలు బాణోత్ చంద్రావతి. గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్. డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు...