బిజెపి బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలి. కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు మధిర సెప్టెంబ

Published: Wednesday September 21, 2022
అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైనా ఏలూరి నాగేశ్వరావు  నియోజకవర్గ ముఖ్య నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేసారు.
 మధిర నియోజకవర్గం స్థాయి మండల, జిల్లా మరియు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక రెడ్డి గార్డెన్ నందు జరిగినది. ఈ కార్యక్రమానికి *జిల్లా ప్రముఖ్ కొండా హరీష్ , దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు ముఖ్యలుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మండలాలలో బూత్ స్థాయి లో పార్టీ నిర్మాణం జరగాలని కార్యకర్తలకు సూసించారు. మధిర అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన మధిర మండల మల్లవరం గ్రామానికి చెందిన *బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు  నియోజకవర్గ స్థాయి లో ఘనంగా సన్మానించారు. ఏలూరి నాగేశ్వరావు  మాట్లాడుతూ నాకు నియోజకవర్గ భాద్యత కల్పించిన *రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ  మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ధన్యవాదములు.తెలియజేస్తున్నాను ఈ సందర్భంంగా ఆయన మాట్లాడుతూ.నియోజకవర్గస్థాయి లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అందర్నీ కలుపుకుంటూ బిజెపి పార్టీని కార్యకర్తలు అభిమానులు ముందుకెళ్తారని వారు తెలిపారు, ప్రజా సమస్యలపై స్పందించి పరిస్కార దిశగా ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా దళిత మోర్చా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరరావు,మధిర అర్బన్ అధ్యక్షులు పాపట్ల రమేష్, బోనకల్ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు,,ఎర్రుపాలెం మండల అధ్యక్షులు ముక్కపాటి శ్రీనివాసరావు, చంద్రమౌళి, మిరియాల నాగేశ్వరావు, మధిర రూరల్ మండల సీనియర్ బిజెపి నాయకులు కొప్పురావూరి యోగేశ్వరావు,  సోమేశ్వరావు, పట్టణ ఉపాధ్యక్షులు మాదిరాజు సాయిరాం, కోనా నరసింహారావు, జీవి,కనపర్తి ప్రకాశరావు, ఖాజామియా, మోహనరావు శ్యామ్, రామకృష్ణ,తదితర యువమోర్చ నాయకులు పాల్గొన్నారు.