కుమ్రం భీం స్ఫూర్తి తో హక్కుల సాధనకై పోరాడుదాం ** టియూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రహమ

Published: Monday October 10, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 09 (ప్రజాపాలన,ప్రతినిధి) : పోరాట యోధుడు కుమ్రం  భీమ్ స్ఫూర్తి తో జర్నలిస్టుల హక్కుల సాధనకై పోరాడుదాం అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ పిలుపునిచ్చారు. ఆదివారం టియూడబ్ల్యూజే జిల్లా కార్యాలయంలో కొమరం భీమ్ 82 వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకై భీమ్ పోరాట స్ఫూర్తితో హక్కులు సాధించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  టీయూడబ్ల్యూజే నాయకులు అబ్దుల్ హన్నన్, దేవునూరి రమేష్, సురేష్ చారి, చీల నితీష్ కుమార్, రాందాస్ జాడే, నరేష్ కుమార్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.