చర్ల పటేల్ గూడా చైతన్య యూత్ యువజన సంఘం సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్ట
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండల్ చర్ల పటేల్ గూడ గ్రామానికి చెందిన చైతన్య యూత్ యువజన సంఘం సభ్యులు ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా పార్టీలో చేరిన చైతన్య యూత్ సభ్యులు మాట్లాడుతూ మర్రి నిరంజన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై, నియోజకవర్గంలో ఎవరు ఏ ఆపదలో ఉన్న అందుబాటులో ఉంటూ, యువతకు, క్రీడాకారులకు, విద్యార్థులకు, దేవాలయాలకు, పాఠశాలలకు, తన సొంత నిధులతో ఆర్థిక సహాయ సహకారాలు చేస్తున్న మర్రి నిరంజన్ రెడ్డి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరామని ఈ సందర్భంగా తెలిపారు, ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ దేనని ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రశాంత్, ఆనంద్ ,భగత్ ,కిరణ్, వెంకటేష్ ,సాయి, రోహిత్, ఆకాష్ ,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: