రెండోసారి చెరుకు అభివృద్ధి మండల చైర్మన్ గా ఎన్నికైన నెల్లూరి లీలా ప్రసాద్, ఘనంగా సన్మానించి

Published: Tuesday January 11, 2022
పాలేరు జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండల పరిధిలోని మండ్రాజుపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ గా రెండోసారి ఎన్నికైన నెల్లూరి లీలా ప్రసాద్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారిచే కేక్ కట్ చేయించి, స్వీట్స్ పంచి పెట్టారు. అనంతరం నెల్లూరి లీల ప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి సి డి సి చైర్మన్ గా ఎంపిక చేసిన పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి నమ్మకాన్ని కాపాడతానని, నిరంతరం రైతుల సమస్యల పరిష్కారం  కొరకై కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెల్లూరి అనురాధ, వార్డు సభ్యులు తుమ్మా ఉపేందర్, తోళ్ళ బుచ్చాలు, నెల్లూరి వెంకటయ్య, పసుపులేటి వీరబాబు, చట్టు వెంకట నారాయణ, చెరుకుపల్లి వెంకన్న పాల్గొని, శుభాకాంక్షలు తెలియ చేశారు.