పోలీస్ ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు

Published: Thursday October 28, 2021
మధిర, అక్టోబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : గంజాయిపై మధిర పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పలు అనుమానిత నివాసాల్లో అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా శాఖల సీఐలు మురళి, సిహెచ్ నాగేశ్వరావు మాట్లాడుతూ గంజాయ్ అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గంజాయి, గుడుంబా, గుట్కాలు తదితర నిషేధిత మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మధిర సర్కిల్ పరిధిలో ఎక్సైజ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ట్రైన్ షకీర్ ఎక్సైజ్ ఎస్ఐ శార్వాణి తదితరులు పాల్గొన్నారు