చెన్నూరు నాయకుని పేరుతో క్వాటరుకు తాళం

Published: Thursday March 25, 2021

- కౌన్సిలర్ భర్త నిర్వాహకం
- ఇదేమిటని ప్రశ్నిస్తున్న స్థానికులు.

ప్రజాపాలన - క్యాతనపల్లి, 24 మార్చి : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ సమీపాన గల సింగరేణి క్వాటరుకు తాళం వేసి ఆక్రమించుకున్న ఓ అధికార పార్టీ నాయకుడు. ఏరియా పర్సనల్ విభాగం అధికారుల దృష్టికి రావడంతో స్పందించిన అధికారులు ఆక్రమణకు గురైన క్వాటరు వద్దకు వచ్చి పరిశీలించారు. క్వాటరును ఆక్రమించిన వ్యక్తి రా.. మి.. డి.. అని తెలియజేశారు. అధికార పార్టీకి సంబంధించి ఆ నాయకుడు అధికారితో మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఫోన్ చేయించా అని చరవాణిలో చెప్పడంతో ఉ. న్నతాధికారులకు అధికారికంగా చెప్పి క్వాటరును అలాట్మెంట్ చేయించుకోవలసి ఉంటుందని సూచించినట్లు తెలియజేశారు. ముందస్తుగా ఆక్రమించిన వ్యక్తికి సమాచారం ఇచ్చినప్పటికి తను క్వాటరు వద్దకు రాలేదని తెలిపారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త క్వాటరును ఆక్రమించడంతో ప్రజలు, నాయకులు ఇదేం తీరు అని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు చెన్నూరు నియోజకవర్గంలో బాల్క నుమన్ కోట్లాది రూపాయలు పెట్టి నియోజకవర్గంతో పాటు క్యాతనపల్లి పురపాలక సంఘాన్ని అభివృద్ధి  దిశగా  తీసుకెళ్తుంటే, నాయకుడు చేసే అభివృద్ధిని అబాసుపాలు చేసే విధంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాక్టింగ్ జూనియర్ ఇన్స్ పెక్టర్ మోట నారాయణ, జమేదార్ లక్ష్మణ్, సెక్యూరిటీ సిబ్బంది బిక్షపతి, శ్రీనివాస్, సంజీవులు పాల్గొన్నారు.