సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభం

Published: Tuesday August 31, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొగాకు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం పత్రికా ప్రకటన విడుదలచేస్తూ తల్లిదండ్రులు విద్యార్థులను కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని మాస్కు, వాటర్ బాటిల్ ను ఇచ్చి పంపాలని కోరారు. శానిటేషన్ లో భాగంగా గత నాలుగు రోజుల నుండి పాఠశాల పరిసరాలను, తరగతి గదులను శుభ్రం చేయించడం జరిగిందని, ప్రతి గదిని హైపో క్లోరేట్ తో శానిటైజ్ చేయించడం జరిగిందన్నారు. విద్యార్థులంతా విధిగా తరగతులకు హాజరవ్వా లని ఆయన కోరారు.