ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేయించుకోవాలి కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి

Published: Friday October 01, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ ను నివారించడానికి ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టీకాను వేయించుకోవాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి సూచించారు. డివిజన్ పరిధిలోని ఐఐ సిటి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ సెంటర్ను కార్పొరేటర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, స్టాఫ్ నర్స్ దాసరపు ఆదిలక్ష్మి, వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఇన్చార్జి బూడిద రాజు గౌడ్, వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.