బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డును 100 ఫీట్లు కాకుండా 80 ఫీట్ నిర్మించండి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్

Published: Saturday June 19, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపంపల్లి తండా నుంచి ముప్ప వరకు నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డును 100 ఫీట్లు కాకుండా 80 ఫీట్ లకు రోడ్డు నిర్మించాలని తండా ప్రజలు అధికారులను కోరుతున్నారు. 100 పిట్ల రోడ్డు నిర్మాణం చేపడితే, రోడ్డు వెడల్పు లో తమ షాపులు కోల్పోవడంతో, ఉపాధి కోల్పోతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు ను 80 ఫీట్లకే చేపట్టాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డీఈ ఫానిజ గారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, శ్రీ రాములు, రమేష్, ప్రభాకర్, వేణు రెడ్డి గారు, వేణు, గోపంపల్లి తండా గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.