కళ్యాణ లక్ష్మి చెక్కును అందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday October 28, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : బలహీన వర్గాల కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా కళ్యాణ లక్ష్మి ఉపయోగపడుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు కు చెందిన చింతకింది పద్మ, రాజం దంపతుల కుమార్తె  రమ్యకు ఒక లక్ష 116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందులో భాగమే ఈ కల్యాణ లక్ష్మి పథకం కూడా ఒకటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేతా శ్రీధర్, వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, బెల్లంపల్లి తాసిల్దార్ కుమార స్వామి, డీ టి ప్రసాద్, టి. ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు నారాయణ, మరియు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ సూరం. సంగీత బానేశ్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.