వర్షంలోనూ వాహనాల తనిఖీ : సీఐ సతీష్ కుమార్

Published: Monday May 17, 2021
పాలేరు, మే 16, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి స్థానిక పిఎస్ ఆర్ సెంటర్లో వర్షంలో సైతం  విధినిర్వహణలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తూ అప్పుడప్పుడు వచ్చే వాహనాలను ఆపి ఏ కారణంచేత బయటికి వచ్చారు లాక్ డౌన్ అని తెలవదా ఏకారణంచేత బయటికి వచ్చారో తెలుసుకొని సరైన కారణం లేని వాహనాలకు 1000 రూ చలానా రాశారు అలాగే వాహనదారులు మాస్క్ శానిటైజర్ తప్పకుండా ఉపయోగించాలని చూసించారు ప్రజలు లాక్‌డౌన్‌ టైములో ఎవరు బయటికి రాకూడదని అత్యవసర పరిస్థితుల్లో వచ్చేటప్పుడు తగిన కారణాలు సూచించాలని అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావొద్దు అని అన్నారు సిఐ సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో, ట్రైనీ ఎస్ఐ. కుశక్ కుమార్, ఏ ఎస్ ఐ రాఘవయ్య, కానిస్టేబుల్స్ మల్లయ్య, శ్రీనివాస దాసు, రమేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు