హరిత శానిటేషన్లో పీర్జాదిగూడ కార్పోరేషన్ కు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం : మేయర్ జక్క వెంక

Published: Friday July 16, 2021
మేడిపల్లి, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : అందరి సహకారంతో హరితహారం, శానిటేషన్ విభాగంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్కు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం దక్కిందని సగర్వంగా మేయర్ జక్క వెంకటరెడ్డి తెలియజేశారు. హరితహారం, శానిటేషన్లో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం దక్కించుకున్న సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పడిన ఈ సంవత్సరంనర కాలంలో కార్మికశాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి ఆశీస్సులు డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యుల సహకారం, కమీషనర్ శ్రీనివాస్ ముందు చూపు, హరితహారం, శానిటేషన్ సిబ్బంది నిరంతర కృషి, అందరి సహకారంతో హరితహారం, శానిటేషన్ విభాగంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కు ప్రధమ స్థానం దక్కిందని తెలిపారు. అందరి ఆశీర్వాదంతో మున్ముందు పీర్జాదిగూడ కార్పోరేషన్ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళుతానని సవినయంగా విన్నవిస్తూ, అందరికి పేరు పేరునా మేయర్ వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.