శంకరపట్నంలో సిపిఐ మండల స్థాయి సమావేశం శంకరపట్నం ఫిబ్రవరి 20 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Tuesday February 21, 2023

శంకరపట్నం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సిపిఐ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి  హాజరయ్యారు. ఈ సమావేశంలో  అయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను మోసం చేస్తుందని, నిత్యవసర ధరలు, గ్యాస్ దరలు  పెంచుతు సామాన్యుడి నడ్డి  విరుస్తుందని, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి ధనవంతులకు కొమ్ము కాస్తుందని  ఆయన దుయ్యబట్టారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి కార్మికులు  సిపిఐ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి,  జిల్లా కార్యవర్గ సభ్యులు  బోయిని అశోక్, మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, వివిధ కార్మిక సంఘాలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.