మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ కు శానిటేషన్,మాస్కులు అందజేసిన కార్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్.

Published: Monday June 14, 2021
మధిర, జూన్ 13, ప్రజాపాలన ప్రతినిధి : నిత్యం ముందుండి ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులకు కార్ డ్రైవర్ల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్, మాస్క్ లను మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ కు అందజేశారు. అదేవిధంగా చెక్ పోస్టుల వద్ద  గవర్నమెంట్ హాస్పిటల్ , వ్యాక్సిన్ సెంటర్ల వద్ద శానిటేషన్ మాస్క్ లను అందజేసినట్లు కార్ డ్రైవర్ల ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కారు ఓనర్ యూనియన్ నాయకులు నాగబాబు  బాబురావు ఇక్బాల్ పవన్ అఫ్రోజ్ కిషోర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.