సూర్య ప్రకాష్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన

Published: Saturday February 25, 2023

వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : సూర్య ప్రకాష్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు శుక్రవారం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకోవాలని సూచించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని స్పష్టం చేశారు. అనంతరం మణికంఠ నగర్ లో ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట పూజా కార్యక్రమాలలో పాల్గొన్నామని వివరించారు. చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్ చందర్ నాయక్, ఇతర నాయకులు, భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.