పక్కా ప్రణాళికతో బస్సులు బయలుదేరాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Saturday September 17, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ నిర్వహించే గిరిజన ఆదివాసి సమ్మేళనానికి జిల్లా నుండి వెళ్లే వారికోసం ఏర్పాటు చేసిన బస్సులు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో బస్సుల నిర్వహణకు సంబంధించి జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ వాజ్పాయి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ బయలుదేరే వారి కోసం జిల్లా నుండి మొత్తం 87 బస్సులు కేటాయించామన్నారు. కాగజ్ నగర్ నియోజకవర్గం నుండి 10 బస్సులో, సిర్పూర్ యు, లింగాపూర్, జైనూర్, నుండి 38 బస్సులు, ఆసిఫాబాద్ నుండి 39 బస్సులు, బయలుదేరనున్నట్టు తెలిపారు. కేటాయించిన అధికారులు సరైన సమయానికి బస్సులు బయలుదేరే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. బస్సులు కేటాయించిన సమయం ప్రకారం బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.