అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సింగరేణి సిబ్బంది

Published: Saturday March 13, 2021

క్యాతన్పల్లి, మార్చి 12, ప్రజాపాలన : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి స్థలంలో ఆక్రమ కట్టడాన్ని ఏరియా ఎస్టేట్ సెక్యూరిటీ సిబ్బంది కూల్చివేశారు. శుక్రవారం ఎస్టేట్ అధికారి రమేష్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పట్టణంలోని సింగరేణి స్థలాల్లో కట్టడాలను అడ్డుకోవడంలో సింగరేణి ముందుందన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీనగర్ హట్స్ ఏరియా ప్రాంతంలో అక్రమ కట్టడం చేపట్టనున్నట్లు సిబ్బందికి తెలియడంతో గార్డు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే వాటిని అడ్డుకొని కూల్చి వేసినట్లు పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో అనుమతులు లేకుండా కట్టడాలు చేపడితే చర్యలు తప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు