వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను జయప్రదం చేయండి

Published: Saturday December 17, 2022
రైతు సంఘం జిల్లా నాయకులు దొండపాటి నాగేశ్వరరావు
 
బోనకల్, డిసెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి: ఈనెల 29న ఖమ్మంలో జరుగు వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం సంఘం జిల్లా నాయకులు దొండపాటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా నాయకులు గుగులోతు నరేష్ మాట్లాడుతూ వ్వవసాయ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేరళ ముఖ్యమంత్రి పిన్నరై విజయన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, కావున మండలంలోని వ్యవసాయ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావినూతల ప్రజా సంఘాల నాయకులు గుగులోత్ పంతులు, డాక్టర్ గోపి , మంద వీరభద్రం , నాగరాజు, గండు సైదులు, కొమ్మినేని పిచ్చయ్య , కార్మిక సంఘం నాయకులు భానోత్ మానియా. సరిరాములు, సాధు, ధేవ్ సింగ్, స్వామి, బానోత్ నాగమ్మ ధరావత్ బుజ్జి, అచ్చమ్మ, దీవ్లి ,వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.