18 సం.లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి

Published: Thursday December 16, 2021
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 15, ప్రజాపాలన : జిల్లాలో 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోనులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు కళాశాలలను సందర్శించి విద్యార్థినీ, విద్యార్థులతో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ వైరన్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని వైరన్ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉ ౦డాలని, కళాశాలల పరిధిలో 18 సం॥లు నిండిన విద్యార్థినీ, విద్యార్థుల జాబితా తయారు చేసి అందించాలని, జాబితా ప్రకారంగా మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలు టీకాలు అందించడం జరుగుతుందని, వ్యాక్సిన్పై అపోహలు, సందేహాలు, ఇతర వివరాలకు 9492120078 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.