సిఎంకు రాజీనామా పంపిన డా.శైలేందర్ రెడ్డి
Published: Monday August 22, 2022
జగిత్యాల, ఆగస్టు, 21 ( ప్రజాపాలన ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెరాస సీనియర్ నాయకులు డా. శైలేందర్ రెడ్డి తెరాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తు లేఖను పంపారు. ఆదివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ లేఖలో గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సుశిక్షితుడైన, క్రమశిక్షణ కలిగిన ప్రజల నాయకుడిగా పనిచేశానని శైలేందర్ రెడ్డి పేర్కొన్నారు. మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీపడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటు పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను కాపాడుకుంటూ పనిచేశానని పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల తెరాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని సీఎం కు పంపిన లేఖలో డాక్టర్ శైలేందర్ రెడ్డి కోరాడు.
Share this on your social network: