ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి,

Published: Thursday December 15, 2022

*శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి  మహా పడిపూజ  కార్యక్రమంలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి*

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో పడిపూజ ఇరుముడి కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ని రంగాపూర్ సన్నిదాన స్వాములు శాలువతో సన్మానించారు,అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని దైవ ప్రసాదాలు స్వీకరించారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ,అష్ట ఐశ్వర్యాలతో ,సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని  వేడుకున్నారు, అనంతరం అయ్యప్ప  స్వాములకు భక్తులకు, గ్రామ ప్రజలకు, బంధుమిత్రులకు, మర్రి నిరంజన్ రెడ్డి  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం* నిర్వహించారు,ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు* అధిక సంఖ్యలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టేకుల కమలాకర్ రెడ్డి, గురుస్వాములు శ్రీనివాస్,బకున రమేష్ , బోల్గం  శ్రీశైలం, శేఖర్,మహేందర్ గౌడ్, ఇటికల గోవర్దన్ రెడ్డి (స్వామి),యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ ముదిరాజ్,నాయకులు ఓరుగంటి మహేష్ గౌడ్,గణేష్ నాయక్, రాఖీ,సునీల్,శ్రీకాంత్ గౌడ్,  మరియు గ్రామస్తులు, బంధుమిత్రులు, తదితరులు  పాల్గొన్నారు.