రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను

Published: Wednesday June 02, 2021
పరిగి, 1 జూన్ ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామములో ఐకెపి ద్వారా నిర్వంచబడుతున్న వరి ధాన్యం సేకరణ కేంద్రములో తీవ్రమైన భస్తాల కొరత ఏర్పడగా, అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెన్నకిస్టప్ప, మాజీ ఉప సర్పంచ్ సాయన్న. నర్సింలు, నిమ్మలి వెంకటయ్య, శ్రీనివాస్, అంజిలయ.రమేశ్ నాయక్, వారు గ్రామ రైతులు ఎదుర్కుంటున్న సమస్యను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పర్గి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని రాగ, వెంటనే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పందించి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి, కాలి సంచులను పరిగి నుంచి తేచ్చుకునేటట్లు ఏర్పాటు చేయగా, 3000 బస్తాలను తెచ్చి రైతులకు వారు అందుబాటులో ఉంచారు... బస్తాలు పొందిన రైతులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ కి కృత్ఞతలు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు.