ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్రివర్ణ పథకం ఆవిష్కరణ

Published: Friday January 27, 2023
జన్నారం, జనవరి 26, ప్రజాపాలన: మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 74 వ రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా త్రివర్ణ పథకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరి నరసయ్య మాట్లాడుతూ భారతమాత దస శకలాలు తెంచిన రోజు, స్వతంత్ర సమర పోరాటంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడారని, నేటి యువతకు స్వతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని కోరారు. ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య హక్కుల చట్టాలలో భారత్ విశ్వ గురువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గాజుల లింగన్న గౌడ్, మందపల్లి కాంతయ్య, ఎంబడి మల్లేశం, శీలా చంద్రశేఖర్, గుండ పవన్, అమరగోండ సతీష్ గౌడ్, జాడి వెంకట్, గోనెసత్యం, ఐలవేణి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.