మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం

Published: Thursday December 08, 2022

బోనకల్, డిసెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు గుర్తించటం , హరిత హారం చెట్లకు ప్రతి వారంలో కనీసం రెండు సార్లు నీరు పోయాలన్నారు. నర్సరీల ఏర్పాటు , మట్టి సేకరణ తదితర పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బోడెపూడి వేణుమాధవ్, ఎంపీఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏ పీ ఓ బసవోజు కృష్ణకుమారి,, పంచాయతి కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.