బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం

Published: Saturday July 09, 2022

రాయికల్, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ అధ్యక్షులు కల్లెడధర్మపురి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ బస్సుచార్జీలు,కరెంటుచార్జీలను పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని,అలాగే రెవెన్యూరిజిస్ట్రేషన్ చార్జీలుపెంచడం వల్ల తెలంగాణప్రజలు ఇబ్బందిపడుతున్నారని, పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బి.జె.పి కార్యకర్తలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి,కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి,రామకృష్ణ ప్రేమ్ రెడ్డి ఉపాధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, కె.భూమేష్,శంకర్,  షెట్కర్ విఠల్,బీసీసెల్ కార్యదర్శి సింగనిసతీష్,తోకల శంకర్,నరేష్,సుమన్, రవి,కిషోర్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, మల్లేష్ యాదవ్, ఆర్మూర్ శంకర్,కార్యకర్తలుతదితరులుపాల్గొన్నారు