శానిటైజర్, మాస్క్ లను పంపిణీ చేసిన నరసింహ గౌడ్
Published: Wednesday May 26, 2021
పరిగి, మే 25, ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్ పేషంట్ లకు తన వంతుగా పండ్లు మరియు సానిటైజర్, మాస్క్ లను పంపిణీ చేసారు. పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామనికి చెందిన మాజీ ఎంపీటీసీ సత్తయ్య గౌడ్ తనయుడు లక్ష్మీ నరసింహ మానవత్వం చాటారు. తను హైదరాబాద్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ తన గ్రామంలో కోవిడ్ బాధితుల వివరాలు సేకరించి తనవoతుగా పండ్లు మరియు సానీటైజర్ మస్కులను గ్రామ వైద్య సిబ్బంది అయిన ఎన్ ఎమ్ మరియు ఆశవర్కర్ లతో పంపిణీ చేయించారు. తను ఫోన్ ద్వారా పేషంట్ లతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండటమే కరోన కి నిజమైన వైద్యం అని అన్నారు. జాగ్రత్తగా ఉంటూ మందులు క్రమంగా వాడమని ధైర్యం ఇచ్చారు. గ్రామo గురించి ఆలోచించి ధైర్యం చెప్పిన తనకి హర్షవ్యక్తం చేశారు.
Share this on your social network: