ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే. డా.సంజయ్

Published: Monday January 10, 2022

జగిత్యాల, జనవరి, 09 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేసినారు. అనంతరం వారికి ఉచిత కళ్ళ అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్, కౌన్సిలర్లు చుక్క నవీన్, శివ కేసరి బాబు, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కొలగాని సత్యం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.