విద్యార్థి నిరుద్యోగ సైరన్ లో శివమెత్తిన యువజన కాంగ్రెస్

Published: Monday October 04, 2021
వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ సతీష్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 అక్టోబర్ ప్రజాపాలన : నిరుద్యోగ యువత కోసం విద్యార్థులకోసం గళమెత్తి పిడికిలి బిగించామని వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రైల్వే వంతెనపై యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్న పెద్ద నియంత సిఎం కేసీఆర్ అని విమర్శించారు. యువత ఈ దుర్మార్గాన్ని గమనించాలని పిలుపునిచ్చారు. నియంత పతనం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. నియంత భయమే అందుకు సంకేతమని వివరించారు. శనివారం యువజన కాంగ్రెస్ తలపెట్టిన నిరుద్యోగ జంగ్ సైరన్ పాదయాత్ర కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మధ్యలో హైదరాబాద్ సిటీ ఎల్బి నగర్  వద్ద అరెస్ట్ చేయడం నీతిమాలిన పిరికిపంద చర్య అని ఎద్దేవా చేశారు. వికారాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాన బ్రిడ్జిపై రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల సతీష్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ పరిగి నియోజకవర్గ అధ్యక్షుడు మీర్జా ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు నరసింహా రెడ్డి నిఖిల్ రెడ్డి నాయబ్ జానీ యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ సుధాకర్ ఎన్ఎస్యుఐ నాయకులు అనుపు రెడ్డి ఫిరోజ్ సైఫ్ సోహెల్ చాకలి రవీందర్  తదితరులు పాల్గొన్నారు.