శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మూలనక్షత్రం సరస్వతీ దేవి అలంకారం
Published: Monday October 03, 2022
మధిర అక్టోబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడవ రోజు మూలనక్షత్రం సరస్వతి దేవి అలంకారం భక్తులందరికీ తెలియజేయునది ఏమనగా దసరా సందర్భంగా దశావతారం సింహద్వారం నుండి ప్రవేశించి అమ్మవారిని దర్శించు కొన వలసిందిగా కోరుచున్నాము . పూజ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి దేవి అమ్మవారు ఈ శరన్నవరాత్రి సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినాము అని తెలిపినారు. పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించదరు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు*
Share this on your social network: