ముంబై నుండి బస్ లో స్వగ్రామానికి వస్తూ గుండెపోటుతో జగిత్యాల జిల్లా మహిళ మృతి

Published: Friday January 28, 2022

కొడిమ్యాల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): ముంబైకి ఉపాధి కోసం వెళ్లి తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తున్న మహిళ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన సంఘటన జగిత్యాల జిల్లాలో విషాదం నింపింది., కొడిమ్యాల మం. పూడూరు గ్రామానికి చెందిన పెద్ది కేతవ్వ (40) అనే మహిళ ముంబైలో కూలి గా పనిచేస్తుంది. స్వగ్రామం పూడూరు గ్రామంకు బయల్దేరెందుకు తన కూతురు కల్యాణితో కలిసి ముంబై నుండి బయలుదేరగా రాత్రి పూణే శివార్లలోని యావత్ గ్రామంలోని ఢిల్లీ దర్బార్ హోటల్ వద్ద ఆమెకు గుండెపోటు రాగా ట్రావెల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలిస్తుండగా రాత్రి 8:30గంటలకు మృతి చెందింది. అక్కడి పోలీసులు కేసు నమోదు చేయగా పోస్టుమార్టం అనంతరం శవాన్ని అప్పగించారు. దీంతో శ్రీ సాయి పూజ ట్రావెల్స్ యాజమాన్యం అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు. గురువారం రాత్రి వరకు స్వగ్రామానికి మృతదేహం చేరుకునే అవకాశం ఉందని సాయి పూజ ట్రావెల్స్ యజమాని పల్లికొండ తిరుపతి వెల్లడించారు. తమ సిబ్బంది మృతదేహం వెంటే ఉండి ఆమె బంధువులకు అప్పగించేందుకు అంబులెన్స్ లో వెళ్తున్నట్లు తెలిపారు. కేతవ్వ ను బ్రతికించేందుకు తీవ్రంగా కృషి చేసిన శ్రీ సాయిపూజ ట్రావెల్స్ సిబ్బంది మహేష్, దుర్గేష్, మునిందర్, డ్రైవర్ నర్సయ్య, మొహమ్మద్ లను ప్రయాణికులు అభినందించారు.