పేదలకు అండగా ఉంటాం
Published: Friday August 06, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని బండలేముర్ గ్రామంలో 29/07/2021 రోజున అనారోగ్యంతో మరణించిన వట్టి రమేష్ యాదవ్ కుటుంబ సభ్యులను గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అంద చేశారు, వారి ఇద్దరు పిల్లలకు తనసొంత నిధులతో హాస్టల్ వసతి కల్పించి పాఠశాలలో వారిని చదువిస్తానని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు ఎడ్మా నరేందర్ రెడ్డి, లింగంపల్లి-నోముల ఎంపిటిసి పల్నాటి జయనందం, బండలేముర్ ఎంపిటిసి మధుసూదన్ రెడ్డి, ఎం ఎన్ ఆర్ యువసేన ప్రెసిడెంట్ టేకుల కమలాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, ప్రదీప్ రెడ్డి, లింగం గౌడ్, జనార్దన్ నాయక్, కొట్టం సత్యం, నవీన్ నాయక్, గ్రామ పెద్దలు ఆకారం కృష్ణ, నాతి చంద్రయ్య, జంగయ్య, కిష్టయ్య, మునిరజ్, లాలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: