మాల మహానాడు రిజిస్ట్రేషన్ నెంబర్ 972 ను ఉపయోగించవద్దు : కుసుమ మధుసూదన్
Published: Monday April 26, 2021
బెల్లంపల్లి, మార్చి 25, ప్రజాపాలన ప్రతినిధి : జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కారెం శివాజీ నిర్వహించినటువంటి తెలంగాణ మహానాడు రిజిస్ట్రేషన్ నెంబర్ 972 పసుల రామ్మూర్తి ఉపయోగించుకో వద్దని తెలంగాoణ మాల మహానాడు రాష్ట్రదర్శి కుసుమ మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుల రామ్మూర్తి నర్సింహయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తున్న 972ను వాడుకోవద్దని మీ యొక్క సంఘం పేరు ఏమిటో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమిటో తెలపాలని లేనిచో మా సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన అన్నారు. మా సంఘం పేరును మా రిజిస్ట్రేషన్ నంబర్ను ఉపయోగించుకుని కార్యక్రమాలు చేపట్టినట్టు అయితే మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Share this on your social network: