ప్రతిఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలి*

Published: Monday October 03, 2022
ఎంపీపీ మెండెం లలిత*మధిర రూరల్ అక్టోబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎంపీపీ లలిత పాల్గొని గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటాని పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ ఆదర్శంగా తీసుకొని మనందరం వెళ్లాలనిప్రతి ఒక్కరూ గాంధీ మహాత్ముడు చూపిన ఆహింసా మార్గంలో నడవాలని పేర్కొన్నారు  మండల పరిషత్ అధ్యక్షురాలు మెండెం లలిత సూచించారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి మెండెం వెంకన్న మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
Attachments area