సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday February 22, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులు రామంతపూర్ డివిజన్ కు చెందిన పి.అనిల్ కుమార్ 60,000/- మహేశ్వర్ 60,000/- ఫాతిమా మింజా 28,000/-  అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ ముస్తాక్, నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకల ముత్యం రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, అశోక్, రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.