టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రవికుమార్

Published: Monday August 16, 2021
మేడిపల్లి, ఆగస్టు15 (ప్రజాపాలన ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండోసారి ఎన్నికైన సందర్భంగా వై వి సుబ్బారెడ్డిని రాష్ట్ర యువ కాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్, తోలుపునూరి కృష్ణ గౌడ్, విజయ్ కుమార్ లు సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వై వి సుబ్బా రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రల ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని తిరుమలేశుని వేడుకున్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తిరుమలేశుని చల్లని చూపు రెండు తెలుగు రాష్ట్రల ప్రజలపై ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.