నష్టపోయిన రైతులను ఆదుకోవాలి...

Published: Wednesday September 29, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్లో గులాబ్ తుపాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పర్వాహక ప్రాంతలైన బీర్పూర్ మండలంలోని రంగాసాగర్ మంగేల కమ్మునూర్ చిత్రవేణిగూడెం రేకులపల్లి చిన్నకోల్వాయి గ్రామాలలోని పంటపొలాలు నీట మునగడం జరిగిందని ఖరీఫ్ పంటలో ఇప్పటి వరకు మూడుసార్లు నీట మునిగిపోవడం పొట్ట దశలో ఉన్న పొలాలు తీవ్రంగా నష్టపోవడం కమ్మునూర్ లోని వైకుంఠ ధామం కూడ నీట మునగడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవసిందిగా అధికారులను ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్ రావు కమ్మునూర్ సర్పంచ్ బందెల మరియా రాజేశం మాజీ ఎంపీటీసీ బర్ల లక్ష్మీనారాయణ తోట శ్రీనివాస్ రైతులు ఉన్నారు.