10లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం

Published: Monday June 14, 2021
మేడిపల్లి, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 8వ డివిజన్ బీబీ సాహెబ్ మఖ్త అమృత కాలనీలో మున్సిపల్ జనరల్ ఫండ్ రూ.10.00 లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తో కలిసి నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ శ్రీనివాస్, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, పండ్ల కిషన్ గౌడ్, కాలనీ వాసులు, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.